హీరోయిన్ ఛార్మి.. కారు దిగి సిట్ కార్యాలయంలోకి వెళ్తుండగా.. తనపై ఓ కానిస్టేబుల్ చేయి వేశాడని సిట్ అధికారులతో ఆమె పిర్యాదు చేసింది. ఇటివలే ఛార్మి డ్రగ్స్ కేసు కి సంబంధించిన విచారణకు హాజరైంది. ఆమె సిట్ కార్యాలయంకు వెళ్తుండగా.. పోలీసులు చేసిన హంగామాపై సిట్ అధికారులకు ఛార్మి ఫిర్యాదు చేసింది. ఛార్మి కారు దిగి లోపడికి వెళ్తుండగా అక్కడున్న పోలీసులు సెల్ఫీలు దిగేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.
అక్కడ మహిళా పోలీసులు ఉన్నప్పటికి.. శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ చార్మిపై చేయి వేశాడు. ఈ విషయంపై చార్మి అప్పుడే కాస్త అసహనం వ్యక్తం చేసింది. తర్వాత విచారణకు హాజరైన చార్మి.. తొలుత ఈ విషయాన్నే ప్రస్తావించినట్లు సమాచారం. శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ తనపై చేయివేశాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకుంటామని చార్మికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇంకోవైపు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛార్మిని సిట్ అధికారులు విచారించారు. చార్మి, కెల్విన్ మధ్య వెయ్యికి పైగా వాట్సప్ కన్వర్జేషన్స్ జరిగినట్లు తెలుస్తోంది. కెల్విన్ ఫోన్లో చార్మి దాదా పేరుతో ఫోన్ నెంబర్ ఉన్నట్లు తెలిసింది. జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్లో కెల్విన్తో కలిసి చార్మి ఫొటోలు దిగినట్లు ప్రచారం జరుగుతోంది.