Sunday, April 28, 2024
- Advertisement -

హిరణ్య కశ్యప పై గుణశేఖర్ అప్ డేట్ ఇస్తున్నాడా..?

- Advertisement -

భారి సెట్లకు పెట్టింది పేరైన గుణశేఖర్ కు కొద్ది రోజులుగా గడ్డు రోజులు నడుస్తున్నాయని చెప్పొచ్చు.. ఆయననుంచి నుంచి తెలుగు లో సినిమా వచ్చి చాలా రోజులే అయ్యింది. అప్పుడెప్పుడే రుద్రమదేవి చిత్రం వచ్చిన  గుణశేఖర్ నుంచి ఇప్పటివరకు సినిమా రాకపోవడం ఆశ్చర్యం కలిగించేదే.. ఆమధ్య హిరణ్య కశ్యప అనే సినిమా తో కొంత హడావుడి చేసిన ఆ సినిమా ఆగిపోయినట్లు అనిపిస్తుంది.. ఆ తర్వాత అది మొదలయ్యే లోపు గుణ ఒక వెబ్ సిరీస్ చేయాలనుకున్నాడని.. నెట్‌ఫ్లిక్స్ వాళ్లతో ఒప్పందం కుదిరి దాని మీద వర్క్ చేశాడని.. ఐతే గుణ పనితీరు నచ్చక నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి.

కానీ గుణ శేఖర్ వెంటనే దానిపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.. తాను నెట్‌ఫ్లిక్స్‌తో కానీ.. మరే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో కానీ అసోసియేట్ కాలేదని.. తనకసలు వెబ్ సిరీస్‌లు చేసే ఆలోచన కానీ, ఆసక్తి కానీ ఎంతమాాత్రం లేవని.. కాబట్టి తన గురించి లేని పోని వార్తలు సృష్టించవద్దని అతను ఈ స్టేట్మెంట్లో పేర్కొన్నాడు.అంతేకాకుండా తన నుంచి అతి త్వరలోనే ఒక అప్‌డేట్ రాబోతోందని.. దాని కోసం ఎదురు చూడాలని గుణశేఖర్ చెప్పాడు.

చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన గుణశేఖర్ ఖాలిగా ఉండడం ఇదే తొలిసారి ఏం కాదు.. సైనికుడు తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సినిమా చేసినా గుణశేఖర్ ని హిట్ పలకరించలేదు.. దాంతో రుద్రమదేవి తో ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్లేదనిపించుకుంది.దాదాపు ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు రానా తో హిరణ్య కశ్యప అనే సినిమా చేస్తున్నాడు. సురేష్ బాబు ఈ మెగా ప్రాజెక్టును నిర్మించడానికి రెడీ అయినట్లు ఇంతకుముందు సంకేతాలందాయి. కానీ కరోనా దెబ్బకు లెక్కలన్నీ తారుమారైన పరిస్థితుల్లో రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించడం పెద్ద రిస్క్ అన్న ఉద్దేశంతో సురేష్ బాబు తటపటాయిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు గురించి గుణ ఏం అప్‌డేట్ ఇస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -