సాయి పల్లవి.. ఈ భామ వరుణ్ సరసన ఫిదా మూవీలో భానుమతిగా నటించి.. టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. దాంతో ఈ భామ ఏ సినిమాలో నటిస్తే.. ఆ సినిమాకోసం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ భామ న్యాచురల్ స్టార్ నానితో mca (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఫిదా హిట్ తర్వాత ఈమె సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. సాయిపల్లవి రెమ్మునరేషన్ కన్నా కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఓ మై ఫ్రెండ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా సెట్స్లో నాని- పల్లవి మధ్య గొడవ జరిగిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. ఒక సీన్ విషయంలో ఇద్దిరి మధ్య అభిప్రాయ భేదం వచ్చిందట.. దీంతో నాని ఒక్క హిట్కే అంతలా ఎగరొద్దని గట్టిగానే చెప్పాడని సమాచారం. దీంతో బాగా ఫీల్ అయిన సాయి పల్లవి నానితో నటించనని సెట్ను వీడి వెళ్ళిపోయిందట. దీంతో దిల్ రాజు రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగిందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.