Monday, May 6, 2024
- Advertisement -

మహేష్‍కి చుక్కలు చూపిస్తున్నాడు?

- Advertisement -

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాని పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

ఇటివలే ఓవర్సీస్ రైట్స్ ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాలన్నింటినీ బీట్ చేసి రూ. 13 కోట్లకు అమ్ముడు అయ్యి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఐతే ఈ సినిమా షూటింగ్‍లో దర్శకుడు శ్రీకాంత్ మహేష్‍కి చుక్కలు చూపిస్తున్నాడని టాక్‌.  మహేష్‍కి ఈ సినిమా కథ ఒకటి చెప్పి, ఇప్పుడు మరొకటి తీస్తున్నాడట.

దీంతో కోపం తెచ్చుకున్న మహేష్ శ్రీకాంత్‍పై పైర్‍ అయ్యాడట. నువ్వు చెప్పిందొకటి.. తీస్తుంది మరొకటని కోపడ్డాడట. మహేష్‍కి చెప్పిన కథకి ఇప్పుడు తీస్తున్న కథకి అసలు సంబంధం లేదట. ఈ విషయమై మహేష్ శ్రీకాంత్‍కి చాలా సార్లు చెప్పాడట. దర్శకుడు ఇలా చెయ్యడంతో మహేష్ చాలా ఆందోళన చెందుతున్నాడట. సో మరి ‘బ్రహ్మోత్సవం’ చిత్రం మహేష్‍కి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -