స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘సరైనోడు’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్సింగ్, కేధరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఐతే ఈ సినిమా టీజర్ విడుదలకాక ముందే ఇందులోని ఓ డైలాగ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల చేస్తుంది.
ఆ డైలాగ్ ఏంటంటే ‘తెల్ల తోలు ఉందని క్లాసు అనుకుంటున్నావేమో… మాస్, పక్కా మాస్’ అనే డైలాగ్ ఇప్పుడు అందరినీ అలరిస్తుంది. ఐతే ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదలవబోతుంది. ఈ డైలాగ్ ఈ సినిమాలో ఉందో లెదో తెలియాలి అంటే టీజర్ వచ్చేంతవరకు ఆగాల్సిందే. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. తాజా ఓ భారీ సెట్లో అల్లు అర్జున్, కేధరిన్ త్రెసాలపై ఓ పాట షూట్ చేశారు. శ్రీకాంత్, ఆది ముఖ్యపాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.