- Advertisement -
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్లో బిజిగా ఉన్నాడు. ఈ సినిమాకు వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్కు ప్లాన్ చేశాడట చిత్ర దర్శకుడు. దీనికి సంబంధించిన ట్యూన్ను ఇప్పటికే రెడీ చేశాడు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. ఈ ఐటెం సాంగ్లో మహేశ్ పక్కన స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని చిత్ర నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడని తెలుస్తుంది.
దీనిలో భాగంగానే ఇద్దరు,ముగ్గురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. మహేశ్తో ఇప్పటి వరకు చేయని హీరోయిన్తో ఈ సాంగ్ చేయించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇక సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డె నటిస్తుంది. ఈ సినిమాలో మహేశ్ ఫస్ట్ టైం ఫుల్ గెడ్డం, మీసంతో కనిపించనున్నాడు.