వరసగా ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో హిట్ కొట్టి టాలీవుడు టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరిపోయాడు దర్శకుడు కొరటాల శివ. మాస్ పల్స్ తెలిసిన ఈ దర్శకుడు ఇప్పుడు మాస్లో ఫుల్ పాలోయింగ్ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాకి రెడి అయ్యాడు.
నాన్నకు ప్రేమతో మంచి విజయం సొంతం చేసుకోవడంతో మంచి జోష్ మీద ఉన్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమా కలక్షన్స్ కురిపిస్తుంది. కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోనేషన్లో జనతా గ్యారెజ్ అనే సినిమా రాబోతుంది. అయితే ‘శ్రీమంతుడు’ నిర్మించిన మైత్రి సంస్థే మళ్లీ జనతా గ్యారెజ్ సినిమాని నిర్మిస్తుంది.
ఈ సినిమా సీడెడ్ రైట్స్ ఏకంగా 9 కోట్లకు అమ్ముడుపోయింది. అన్ని ఏరియాల్లో జనతా గ్యారెజ్ కి మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ గత చిత్రాలకంటే ఎక్కువ క్రేజ్ ఉంది ఈ సినిమాకు. వచ్చేనేలలో ఈ సినిమా సెట్స్ మీదికి వేళ్లానుంది. తెలుగులో చాలా కాలం తర్వాత మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.