Wednesday, May 22, 2024
- Advertisement -

రాజ‌మౌళి సినిమాలో శ్రీదేవి కుతురు ఫిక్స్?

- Advertisement -

బాహుబ‌లి సినిమా త‌రువాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి పేరు యావ‌త్తు మారుమెగుతున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.బాహుబ‌లి త‌రువాత కొంత గ్యాప్ తీసుకున్న రాజ‌మౌళి టాలీవుడ్‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్‌కు సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్,మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు.ఒక హీరోతోనే ఎన్నో మ్యాజిక్‌లు చేసే రాజ‌మౌళి మరి ఇద్ద‌రు హీరోలు త‌న సినిమాలో ఉంటే ఇంకా ఎన్ని మ్యాజిక్‌లు చూపిస్తారో అని ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ తెగ ఆనందప‌డిపోతున్నారు.ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒక‌టి వినిపిస్తుంది. ఈ మల్టీస్టార‌ర్‌లో అతిలోక సుంద‌రి శ్రీదేవి కుతురు జాన్వీ క‌పూర్‌ను ఎంపిక చేసినట్లు స‌మాచారం.

జాన్వీ క‌పూర్ ద‌ఢ‌క్ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.మొద‌టి సినిమాతోనే అద‌రి దృష్టి ఆక‌ర్షించింది జాన్వీ.సినిమా కూడా సూప‌ర్ హిట్ కావ‌డంతో వ‌ర‌స సినిమాలలో అవ‌కాశాలు వ‌స్తున్నాయి.అయితే రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌లో జాన్వీని తీసుకోవ‌డం వెన‌క పెద్ద త‌తంగ‌మే న‌డిచింద‌ని టాక్.బాహుబ‌లిని బాలీవుడ్‌లో విడుద‌ల చేసిన కరణ్ జోహర్ రాజ‌మౌళితో మాట్లాడి,ఆయ‌న‌ను ఒప్పించి ఈ సినిమాలో తీసుకునేలా చేశార‌ని స‌మాచారం.రాజ‌మౌళి సినిమాలో అయితే జాన్వీకి త‌ప్ప‌కుండా హిట్ వ‌స్తుందని,ఇక్క‌డ ఆమెకు మార్కెట్ విలువ ఎక్కువుగా ఉంటుంద‌ని కరణ్ జోహర్ ఆలోచ‌న‌.బాహుబ‌లి సినిమాతో భార‌త‌దేశం మొత్తం క్రేజ్ ఏర్ప‌డింది.దీంతో ఆయ‌న సినిమాలు హిందీలో కూడా విడుద‌ల అవుతుంటాయి కాబ‌ట్టి జాన్వికి దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలంటే రాజమౌళి సినిమానే కరెక్ట్ అని భావిస్తున్నారు. మ‌రి ఈ వార్త క‌నుక నిజ‌మైతే జాన్వీకి దశ తిరిగినట్టే.దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.ఇప్ప‌టికే ఈ సినిమాలో ప‌లువురు హీరోయిన్ల పేర్లు వినిపించిన అవి రూమ‌ర్లే అని తేలాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -