ఇటివలే సాక్షి ఫ్యామిలీ పేజీలో ప్రచురితమైన గాయనీ సునీత ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తన ఫ్యామిలీ విషయాల గురించి ఇప్పటి వరకు ఎక్కడా నోరు మెదపని సునీత సాక్షి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన సంగతులను వెల్లడించింది. తన భర్త కిరణ్తో ఎందువల్ల విడిపోవాల్సి వచ్చిందో తెలిపింది.
ఇలా పలు విషయాలతో పాటు ఎంపీ మధుయాషీ్కి తనకు ఎఫైర్ ఉందని వచ్చిన పుకార్ల గురించి ఇలా పలు సంచలన విషయాలను బహిర్గతం చేసింది. సాక్షి పత్రికకు ఈ ఇంటర్వ్యూ వల్ల మంచి మైలేజీని ఇచ్చిందనడంలో సందేహం లేదు. అటువంటి వార్తలు అందరికి ఆసక్తితో పాటు మహిళలకు కూడా ఆమంటే గాయనిగా ఎంతో మంది అభిమానులున్నారు. అంతటి పేరు గల సింగర్ గురించి రాస్తే చదవని వారు ఎవరుంటారు.
అయితే అటువంటి వార్తే ఇప్పుడు మళ్లీ ప్రచురితమవుతోందని వార్తలు వస్తున్నాయి. అదేమంటే యాంకర్ ఝాన్సీ తన భర్త జోగి నాయుడుతో విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్న ఝాన్సీ కూడా ఇలాంటి సంచలన ఇంటర్వ్యూ ఇవ్వబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఝాన్సీ-జోగినాయుడుల ప్రేమ వ్యవహారం, పెళ్లి విషయాలు, విడాకులకు దారి తీసిన పరిస్థితులు మొత్తం వచ్చేస్తాయనే చెప్పాలి. ఈమె భావాలు ఏవిధంగా వ్యక్తపరుస్తుందో వెయిట్ అండ్ సీ..
Related