Tuesday, April 30, 2024
- Advertisement -

అర్ధగంట వాదన జరిగిందట!

- Advertisement -

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ అనే సినిమా చేస్తున్నాడు. సరికొత్త కథతో ఈ సినిమా తెరకేక్కుతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ ఎక్కువ భాగం ఈ సెట్లోనే జరగనున్నది.

ఈ సెట్ కు పక్కనే రెండు రోజుల క్రితం ఓ టీవీ సీరియల్ షూటింగ్ జరిగిందట. టీవీ సీరియల్ షూటింగ్ జరుపుకుంటున్న ఇంటి వెనుకే జనతా గ్యారేజ్ సెట్ ఉండడంతో సీరియల్ వారు తమ కెమెరాని జనతా గ్యారేజ్ సెట్ లో పెట్టి తమ ఇంటివైపు చిత్రీకరించడం మొదలుపెట్టారట. ఇది గమించిన చిత్ర యూనిట్ వారు తమ అనుమతి లేకుండా సెట్ లో కెమెరా పెట్టేందుకు వీలులేదని చెప్పడంతో సీరియల్ వారితో అర్ధగంట వాదన జరిగిందట.

ఆ తర్వాత జనతా గ్యారేజ్ కి సంబందించిన ఫోటోలు కానీ, సెట్ డీటైల్స్ కానీ లీక్ కాలేదని నిర్ధారించుకున్న తర్వాత ఈ గొడవ సద్దుమణిగిందట. జనతా గ్యారేజ్ టీం వారు తమ సెట్ ఫోటోలు, డీటెయిల్స్ ఎక్కడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఈ సంఘటన అందుకు ఓ ఉదహరణ మాత్రమే అంటున్నారు జనం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -