సౌత్ ఇండియన్ సూపర్స్టార్ రజనీకాంత్- క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 2.0. ఈ చిత్రం రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటివకే ఈ సినిమాకి సంబంధించి 2.0 ఫస్ట్లుక్ కార్యక్రమం ముంబైలో భారీ ఎత్తున జరిగింది. ఈ చిత్రంలో విలన్గా బాలీవుడ్ టాప్ హీరో.. అక్షయ్కుమార్ నటిస్తుండగా.. అందాల భామ బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రంపై సౌత్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. అక్షయ్కుమార్ కూడా ఉండటంతో హిందీలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగులో కూడా ఈ సినిమా వీరంగం సృష్టించేందుకు శంకర్ అండ్ టీం ఓ మాస్టర్ ప్లాన్ వేసిందట. ఓ 15 నిమిషాల గెస్ట్ రోల్ను ఓ తెలుగు స్టార్ హీరోతో నటింపజేయాలని ప్లాన్ చేసిన శంకర్ ఆ గెస్ట్ రోల్ కోసం బాహుబలితో నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ను సంప్రదించారట.
ప్రభాస్ బాహుబలి-2తో బిజీగా ఉండడంతో చివరకు శంకర్ అండ్ టీం మూడు హిట్లతో మంచి ఊపుమీదున్న యంగ్టైగర్ ఎన్టీఆర్ను సంప్రదించడంతో పాటు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. శంకర్ – రజనీ సినిమా కావడంతో ఎన్టీఆర్ సైతం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్టు టాక్. ఎన్టీఆర్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తే తెలుగులో 2.0 కి కలెక్షన్ల వర్షం గ్యారెంటీ అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఏఆర్.రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే దీపావళి కానుకగా 2.0 ప్రేక్షకుల ముందుకు రానుంది.
Related