Thursday, May 9, 2024
- Advertisement -

సెంటిమెంట్‌ కురిపిస్తోన్న హీరోలు!

- Advertisement -

మీకు తెలుసో లేదో అప్పట్లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్  ,క‌ళ్యాణ్ రామ్ లు క‌లుసుకోవ‌డానికి అంత‌గా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు.

ఎన్టీఆర్ క‌లుసుకోవాల‌నుకున్నా… క‌ళ్యాణ్ రామ్ ,జాన‌కి రామ్ లు సంబందం లేద‌న్నట్లుగా ఉండేవారు.

జాన‌కి రామ్ చ‌నిపోయాక క‌ళ్యాణ్ రామ్ లో మార్పు వ‌చ్చింది.

ఎన్టీఆర్ తో  క‌లుసుకోవ‌డానికి ఎలాంటి ఇగోలు ప్రద‌ర్శించ‌డం లేదు.అయితే ఇపుడు ఎన్టీఆర్ కు క‌ళ్యాణ్  మ‌రింత‌గా ద‌గ్గర‌య్యే ఛాన్స్ వ‌చ్చింది.దానికి కిక్-2 సినిమా కార‌ణ‌మైంది.

వివ‌రాల్లోకి వెళితే కిక్ 2 సినిమా ర‌వితేజ మార్కెట్ ను మించి మ‌రీ సురేంద‌ర్ రెడ్డి ఖ‌ర్చు పెట్టేశాడు.దీంతో పైనాన్షియ‌ర్లు త‌మ‌కు రావ‌ల్సిన 15కోట్ల అమౌంట్ క్లియ‌ర్ అయితేనే సినిమాను రిలీజ్ చేయిస్తామంటున్నారు.

దీంతో క‌ళ్యాణ్ తీవ్ర మైన టెన్షన్లోకి వెళ్లిపోయాడు.క‌ర‌క్ట్ గా ఇదే టైమ్ అనుకున్నాడో ఏమో మ‌న బుడ్డ ఎన్టీఆర్ రంగంలోకి దిగి 15కోట్లకు గ్యారంటీ ఇచ్చాడు.దీంతో సినిమా ఈనెల‌లోనే మ‌న ముందుకు రావ‌డానికి లైన్ క్లియ‌ర్ చేసుకుంది. అంతే క‌ళ్యాణ్ రామ్ కి ఒక్కసారిగా తార‌క్ పై లేనిపోని అభిమానం పెరిగిపోయింది.అయినోళ్లు ఇంత‌మంది ఉన్నప్పటికీ…. ఎవ‌రూ చేయ‌లేని సాయాన్ని త‌న బ్రద‌ర్ చేయ‌డంతో లేనిపోని సెంటిమెంట్ మ‌న‌వాడిలో పెరిగిపోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -