Wednesday, May 1, 2024
- Advertisement -

రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టిన కృతి శెట్టి?

- Advertisement -

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచి, కాలేజీ కుర్రకారు చూపును తనవైపుకు తిప్పుకుంది.ఈ కన్నడ బ్యూటీ “ఉప్పెన” మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సాధించి నిర్మాతలకు, హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం కృతి శెట్టి టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

కృతి శెట్టి హీరోయిన్ ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సరసన “శ్యామ్‌ సింగరాయ్‌”మూవీలో నటిస్తోంది. అలాగే సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తోంది. ఇంకా ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ కొత్త చిత్రంలోనూ కృతిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.వీటితో పాటు ధనుష్‌ ,నితిన్‌ బెల్లంకొండ గణేష్‌ వైష్ణవ్‌ తేజ్‌ సరసన నటిస్తుందంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Also read:మెగాస్టార్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవో తెలిస్తే షాక్ అవుతారు?

తాజాగా వీటిపై కృతి శెట్టి స్పందిస్తూ ప్రస్తుతం నేను తెలుగులొ మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నాను. అవి హీరోలు నాని, సుధీర్‌ బాబు, రామ్‌తో ఉన్నాయి. వీటన్నింటిని పూర్తి చేయడం మీదే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. మరేదైనా సినిమాకు కమిట్ అయితే నేనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా నా అభిమానులకు తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

Also read:బాలయ్య, ప్రభాస్, మహేష్ బాబుకు ఇష్టాలు ఒకేలా ఉన్నయ్యిగా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -