Saturday, April 27, 2024
- Advertisement -

మహేశ్ బాబు తో ధోని సినిమా.. ఊహించని కాంబినేషన్ ?

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు టాలీవుడ్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగుతుంది. అలాగే క్రికెట్ లో మాజీ కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోనికి ఉండే క్రెజే వేరు. మన దేశానికి మూడు వరల్డ్ కప్పులు అందించిన ఘనత ధోనికే దగ్గుకుతుంది. మరి ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది..ఈ వార్తను ఊహించుకుంటేనే అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది కదూ..! ప్రస్తుతం ఇదే వార్తా సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది. ధోని త్వరలో మూవీ నిర్మాణ సంస్థ ప్రారంభించబోతున్నాట్లు తెలుస్తోంది. ఆ బ్యానర్ ద్వారా సౌత్ హీరోలతో మూవీస్ చేయనున్నడట. తన బ్యానర్ లో మొదటి సినిమాకోసం తెలుగు నుంచి మహేశ్ బాబుతోనూ, తమిళం నుంచి విజయ్ తలపతి తోను, మలయాళం నుంచి పృధ్వీ రాజ్ సుకుమారన్ తో మహీంద్ర సింగ్ ధోని ప్లాన్ చేస్తున్నడట.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. ధోని క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తరువాత వివిధ వ్యాపార రంగాలలో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మూవీ బ్యానర్ స్టార్ట్ చేసి మరో కొత్త బిజినెస్ కు నాంది పలకాలని ధోని భావిస్తున్నడట. మరి ఈ బ్యానర్ పేరెంటి ? ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ? వంటి వివరాలకు ఎలాంటి సమాచారం లేదు. ఇక మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తరవాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేయనున్నాడు. ఆ తరువాత మహేశ్ తో సినిమా కోసం కొరటాల శివ, అనిల్ రావిపూడి వంటి డైరెక్టర్లు లైన్లో ఉన్నారు. మరి మహేశ్ లైనప్ లో ధోనితో మూవీకి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. అసలు ధోని నిజంగానే మూవీ బ్యానర్ స్టార్ట్ చేయబోతున్నాడా ? ఆ వార్తల్లో వాస్తవం ఉందా ? లేదా ఒట్టి రూమర్స్ యేనా ? అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -