- Advertisement -
మహేశ్ బాబు కథానాయకుడిగా తెరకెక్కించనున్న సినిమా పనుల్లో దర్శకుడు మురుగదాస్ నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ముంబై నేపథ్యంలో కొనసాగుతుంది కనుక, అక్కడి లొకేషన్స్ ను ఆయన పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. మహేశ్ బాబు ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తరువాత ఆయన మురుగదాస్ సినిమా చేయనున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా, న్యాయవ్యవస్థలోని లొసుగులకి సంబంధించిన కథాంశంతో రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఈ కథ ముంబైలో జరుగుతున్నట్టుగా ఉంటుందట.
అందువలన దర్శకుడు మురుగదాస్ .. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ అక్కడి లొకేషన్స్ ఎంపికలో బిజీగా వున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేశ్ బాబు జోడీగా శ్రద్ధా కపూర్ ను సంప్రదిస్తున్నారని వినికిడి. అలాగే హిందీలో ఈ సినిమాను అక్షయ్ కుమార్ తో ప్లాన్ చేస్తున్నారట.