- Advertisement -
మంచు మనోజ్, ఆది పినిశెట్టి మంచి స్నేహితులు. ఆది మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ఈ గుండెల్లో గోదారి సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే.
నిజజీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ‘యాగవరాయునిమ్ నా కాక్క’ అనే తమిళ సినిమాను తెలుగులో ‘మలుపు’ అనే టైటిల్తో రీమేక్ చేస్తున్నారు దర్శకుడు సత్య ప్రభాస్. ఈ చిత్రంలో హీరో ఆది సరసన నిక్కీ గల్రానీ హీరోయిన్ నటిస్తుంది.
ఐతే ఈ సినిమాకి సంబంధించి మనోజ్ ఇంటర్వ్యూ కూడా చేశాడు అది త్వరలోనే రానుంది. ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకున్న అనుకోని సంఘటన అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది.. అనే కథాంశం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఫిబ్రవరి 19న రిలీజ్ కానుంది.