Friday, May 3, 2024
- Advertisement -

అనసూయపై ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్

- Advertisement -

అనసూయ.. బుల్లితెరపై ప్రస్తుతం హాట్ యాంకర్ గా కొనసాగుతోంది. యాంకర్ గానే కాకుండా.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తోంది. రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమాలో అనసూయ ఓ కీల పాత్ర చేస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఏంటో చెప్పకపోయిన.. సినిమాలోని కొన్ని డైయలాగ్స్ ని బయటపెడుతూ సోషల్ మీడియాలో హడావిడి చేసింది.

“నింద నిజమైతే తప్పు దిద్దుకో అబద్దమైతే నవ్వేసి ఊరుకో” అనే డైలాగ్ రంగస్థలం సినిమాలో ఉంది అంటూ అనసూయ లీక్ చేసింది. ఈ మధ్య కాలంలో అనసూయ అర్జున్ రెడ్డి సినిమా మీద.. ఆ సినిమాలో నటించిన విజయ్ మీద ఘాటైన విమర్శలు చేసింది. అవి అప్పుడు పెద్ద వివాదం అయ్యాయి. ఇప్పుడు అనసూయ ఆ వివదాం నుంచి బయటపడేందుకు.. రంగస్థలం డైలాగ్ ను వాడుకుంటుందన్న కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. అనసూయ నోరు ముసుకోవడం మంచిదని.. మళ్లీ వివాదం రేపోద్దని.. అయిన రంగస్థలం డైలాగ్స్ లీక్ చేయడం ఎందుకు అని మెగా ఫ్యాన్స్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అర్జున్ రెడ్డి సినిమాపై విమర్శలు చేసి ఫాన్స్ తో తిట్టులు తిని ఇప్పుడు ఏమి పాలుపోని స్థితిలో ఆ కంట్రవర్సి నుండి తప్పించుకోవడానికి రంగస్థలం నుండి లీక్ చేస్తుంది అని అంటున్నారు. అనసూయ తన స్వార్ధం కోసం రంగస్థలం మూవీని వాడుకుంటుందని ఫాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. వాళ్లు చెప్పింది కూడా కరెక్టే.. అనవసరపు విషయాల్లోకి వెళ్లి.. తిట్లు తినడం ఎందుకు మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -