అఖిల్ సినిమాను కొనుక్కొన్న బయ్యర్స్ నిండా మునిగారని వేరే చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ బొమ్మను కోట్లు పోసి కొనుక్కొన్నారు బయ్యర్లు. దీంతో ఈ సినిమా ప్రొడ్యూసర్ నితిన్ కు బాగానే సొమ్ములు వచ్చాయి. అయితే సినిమా అట్టర్ ప్లాఫ్ అయి కూర్చొంది.
దీంతో.. ఇప్పుడు బయ్యర్లు నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి మీద పడుతున్నారు. ఇంత దారుణమైన సినిమాను మాకు అంత భారీ ధరలకు అంటగడతారా? అంటూ వారు వీరిపై మండిపడుతున్నారు. తమకు డబ్బులు తిరిగివ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు.దీంతో నితిన్ ఫ్యామిలీకి ఇబ్బందులు మొదలయ్యాయి. సినిమా డిజాస్టర్ కావడంతో డిస్ట్రబెన్స్ లో ఉన్న వారికి ఈ ఆర్థికపరమైన కష్టాలు కూడా మొదలయ్యాయి.
దీంతో.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ తో ఆయన మాట్లాడుతున్నాడని.. నితిన్ ఫ్యామిలీపై ఎక్కువ ఒత్తిడి తీసుకురావద్దని నాగ్ చెబుతున్నాడని ప్రచారం జరుగుతోంది. అఖిల్ తో నష్టపోయిన వారికి.. తన సినిమాతో ఊరటనిస్తానని నాగార్జున అభయం ఇస్తున్నాడట.
పంపిణీదారులకు ఏదో విధంగా న్యాయం చేస్తామని.. నితిన్ పై ఒత్తిడి తీసుకురావొద్దని నాగార్జున డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పాడని ప్రచారం జరుగుతోంది. మరి అసలు కథ ఏమిటో!