తెలుగు సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చిన.. ఎలాంటి వివాదం వచ్చిన.. ఈ సమస్యకు పరిష్కారం చెప్పగల పెద్దవారు సమర్థుడు గురువుగారు మాత్రమే అంటూ దాసరి నారాయణరావు ఇంటి వైపు నడిచారు. ఎన్నో సంవత్సరాలు గా దాసరి నారాయణరావే పరిశ్రమకు పెద్ద దిక్కుగా కొనసాగారు. అయితే దాసరి మరణం తెలుగు సినీ పరిశ్రమను ఒక్కసారిగా కుదిపేసింది.
{loadmodule mod_custom,Side Ad 2}
రేపు ఏదైనా సమస్య వచ్చినా.. ఏదైన వివదాం వచ్చిన.. దగ్గరుండి అందరికీ న్యాయం జరిగేలా పరిష్కరించగలిగే పెద్ద ఎవరు..? అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిణామాల క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాసరిగారు ఉన్నంత వరకు ఏ లోటు తెలియనివ్వలేదు. ఎన్నో సమస్యలను దాసరి గారు చాకచక్యంగా పరిష్కరించారని నాగ బాబు తెలిపారు.
{loadmodule mod_custom,Side Ad 1}
దాసరి నారాయణరావు మృతితో ఏర్పడిన లోటు ఎవరూ తీర్చలేనిదని, అయినప్పటికీ, చిత్ర పరిశ్రమలో వచ్చే సమస్యలను భుజాన వేసుకుని వాటిని పరిష్కరించేందుకు మోహన్ బాబు వంటి పెద్దలు ఉన్నారని చిరంజీవి సోదరుడు నాగబాబు వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది. ఇంతకాలం పరిశ్రమలో మాకు ఏ సమస్య వచ్చిన దాసరి గారికి ఒక్క మాట చెబితే చాలు.. ఆయన పనులు కూడా ఆపేసి.. పరిష్కరించేందుకు కృషి చేసే గొప్ప మనసు దాసరి గారికి ఉందని నాగబాబు చెప్పారు.
{youtube}PBx9sdYZDy8{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related