యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా రేంజ్ లో భారీ ప్లానింగ్ తో వస్తున్న ఈ సినిమా గురించి ఒక న్యూస్ లేటెస్ట్ గా వైరల్ అయ్యింది. కొరటాల శీ ఈ సినిమాను రియల్ స్టోరీతో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. అదికూడా ఆంధ్రాలో దళితుల మీద జరిగిన దాడి నేపథ్యంతో ఈ సినిమా వస్తుందట.
1985లో బాపట్ల దగ్గర కారంచెడులో జరిగిన దళితుల దాడి మీద ఈ సినిమా కథ రాసుకున్నాడట కొరటాల శివ. ఆ ఘటనలో చాలామంది దళితులు ప్రాణం కోల్పోగా.. ఎంతోమంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన మీదే కొరటాల శివ అద్భుతమైన కథ సిద్ధం చేశాడట్.
మిర్చి నుంచి డైరెక్టర్ గా టర్న్ తీసుకున్న కొరటాల శివ శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఇలా ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక నేపథ్యాన్ని తీసుకుంటున్నడు. ఆచార్య లో కూడా నక్సల్స్ బ్యాక్ డ్రాప్ తీసుకోగా అది కాస్తా ఫ్లాప్ అయ్యింది. ఈసారి దేవర టార్గెట్ మిస్ అవకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. దేవర సినిమాతో తారక్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.