Saturday, May 25, 2024
- Advertisement -

పైసా వసూల్ పోయినందుకు.. ఎన్టీఆర్ సేఫ్..

- Advertisement -

డైరెక్టర్ పూరి జగన్నథ్.. మళ్లీ ఫాంలోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అది కుదరడంలేదు. పోకిరి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన పూరి.. క్రమంగా సినిమాలు ప్లాప్ అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత మహేష్ బాబుతో టీం అప్ అయ్యి చేసిన బిజినెస్ మెన్ కూడా భారీ విజయాన్ని అందుకోకపోయిన.. పర్వాలేదు అనిపించుకుంది. టెంపర్ కూడా అదే రెంజ్ లో ఆడింది.

ఈ రెండు సినిమాల్లో స్టార్ హీరోలు ఉన్నారు కాబట్టి ఆమాత్రం అయినా లాగాయి సినిమాలు. మిగితా సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయి. పూరిలో పైత్యం పెరిగిపోయిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతోంటే.. విషయం అయిపోయిందని స్టార్ హీరోలు పక్కనపెడుతున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ వీరి తరువాత వెంకటేష్ .. అందరు పూరి జగన్నాథ్ తో సినిమాకి ఒప్పుకోలేదు. ఆయన టేకింగ్ మీద నమ్మకం తగ్గింది. మహేష్ బాబుతో అనౌన్స్ చేసిన “జనగణమన” ప్రాజెక్టు ని కూడా క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది. ఇక పైసా వసూల్ స్టోరీ మొదట ఎన్టీఆర్ కె చెప్పాడట పూరి. మొదట పాజిటివ్ గానే స్పందించిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఎందుకో పక్కన పెట్టేశాడట. అయితే బాలయ్య కు పూరి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు.

ఇక ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా.. మొదటి రెండు రోజులు కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించుకున్న.. ఆ తర్వత డౌన్ అయింది. బిజినెస్ పరంగా సేఫ్ గేమ్ ఆడుతూ,తక్కువ రేట్లకే అమ్మినా, ఈ ఓపెనింగ్స్ ని బట్టి చూస్తే, అలాగే సినిమా టాక్ ని బట్టి చూస్తే, మహా అయితే, యావరేజ్ కన్నా ముందుకి పోయే సూచనలు కనిపించడం లేదు. ఇదే రెంజ్ లో సినిమా ఆడితే.. ప్లాప్ రిజల్ట్ పొందడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి అయితే బాలయ్య సినిమా చేయడంతో.. ఎన్టీఆర్ హ్యాపీ అయ్యాడు. ఎందుకంటే ఈ సినిమా ఎన్టీఆర్ చేసి ఉంటే.. అతని ఖాతలో ప్లాప్ సినిమా అయ్యి ఉండేది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -