Wednesday, May 15, 2024
- Advertisement -

ఎన్టీఆర్ జైలవకుశ స్టోరీ ఇదే..?

- Advertisement -

జై లవకుశ సినిమా.. ఎన్టీఆర్ అభిమానుల్లో రోజు రోజుకి.. భారీ అంచనాలు పెంచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి.. ఓ షాకింగ్ వార్త టాలీవుడ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. జై లవకుశ కథ ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకి టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న వార్తల ప్రకారం జైలవకుశ స్టోరీ ఏంటంటే.. ఇద్దరు కవల సోదరులు.. వారిని చంపేందుకు తిరిగే ఓ అన్న.. ఈ ముగ్గురుకి ఒకే తండ్రి కానీ ఇద్దరు తల్లలు.

ఇందులో మొదటి భార్యకు పుట్టిన వాడే జై. రెండో భార్యకు పుట్టిన వారు లవకుశ. అయితే.. తండ్రి వల్లే తన తల్లి చనిపోయిందని.. ఎలాగైన తండ్రిని అతడి కుటుంబన్ని నాశనం చేయాలని జై అనుకుంటూ ఉంటాడు. అలానే చిన్నప్పుడే తండ్రి తనని వదిలి వెళ్లిపోవడంతో జై చెడు సావాశాలతో పెద్ద గ్యాంగ్ స్టర్ గా మారిపోతాడు. ఇంకోవైపు తండ్రితోనే ఉంటూ లవకుశ డ్రామా ఆర్టిస్టులుగా జీవిస్తుంటారు.

ఇలా డ్రామాలు వేసే తమ్ముళ్లకి రౌడీయిజం చేసే అన్నయ్యకి మధ్య నడిచే ఓ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా జై లవకుశని తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ ముడు విభిన్న పాత్రలో కనిపించబోతున్నారు. అలానే పోసాని కృష్ణ మురళి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దాదాపుగా సినిమా మొత్తం పోసాని పాత్ర చుట్టూనే తిరుగుతుందని సమాచారం. మరి ఈ కథ ఫ్యాన్స్ అంచనాల్ని ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -