యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో బిగ్ బాస్ షోకు హోస్ట్ గా శ్రీకారం చుట్టిన తారక్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు మరోసారి అంతకంటే ఎక్కువ స్థాయిలో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో బలమైన టాక్ వినిపిస్తోంది. జెమినీ టీవీలో ప్రసారం కానున్న టాక్ షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నట్టు ఓ న్యూస్ ఇప్పటికే ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
తాజాగా దీనికి సంబంధించిన అప్ డేట్ తెరపైకి వచ్చింది. మరో రెండు నెలల్లో ఈ షో షురూ కానుందట. 60 ఎపిసోడ్స్ తో సాగనున్న ఈ షోకు ఎన్టీఆర్ భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ఒక్కో ఎపిసోడ్కు రూ.30 లక్షలను రెమ్యునరేషన్గా తీసుకుంటున్నాడట. అంటే షో మొత్తానికి రూ.18 కోట్లు తీసుకుంటున్నాడన్నామాట. తెలుగు టీవీ చరిత్రలో ఇదే అతి పెద్ద రెమ్యునరేషన్ కానుందట. మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో సాగే ఈ కార్యక్రమానికి కొత్త పేరు ఫిక్స్ చేస్తున్నారు అది కూడా త్వరలో వెల్లడి అవుతుంది.
కాగా,ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు ఆ సినిమా నుంచి బయటకు వస్తారు.ది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నకొత్త ప్రాజెక్టును కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇక టాక్ షోను ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలియదు గాని శని ఆదివారాల్లో తారక్ రెండు గంటల సనాయన్ని కేటాయిస్తే చాలాట.షో కోసం ఎక్కువగా కష్టపడే అవకాశం కూడా లేదని టాక్ అయితే వస్తోంది. అందుకే తారక్ ఈజీగా ఒప్పేసుకున్నాడట. షోను కొనసాగిస్తూనే షూటింగ్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.