ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న హై ఓల్టేజీ చిత్రం సలార్. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ కానుండగా బాలీవుడ్ బాద్ షా డంకీ సినిమాతో పోటీపడనున్న ప్రభాస్.
ఇక ఈ సినిమాలో పాటలకు సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వైరల్గా మారింది. ఈ సినిమాలో కేవలం రెండు పాటలే ఉండనున్నాయట. ఒకటి స్పెషల్ సాంగ్ కాగా, మరొకటి హీరో ఎలివేషన్కు సంబంధించిన సాంగ్. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సలార్ సినిమా ఓటీటీ హక్కులు భారీ రేట్ కు అమ్ముడయ్యాయట. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ ఏకంగా రూ.160 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుందట. సలార్ తర్వాత ప్రభాస్ …సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్పిరిట్ సినిమాను 2025 సమ్మర్లో కానీ, ఏడాది చివర్లో కానీ రిలీజ్ చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారట.