Monday, April 29, 2024
- Advertisement -

అజ్ఞాతవాసి పాస్ లకోసం ఫైట్లు .. పాట్లు

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనమే. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మనోడు ఆడియో ఫంక్షన్ తో మన ముందుకు వస్తున్నాడు. నోవాటెల్ లో ఎరేంజ్ చేసిన ఈ ఈవెంట్ కోసం విపరీతమైన మ్యాడ్ నెస్ కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే… ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది. ఇప్పటి వరకు పవన్ సినిమా ఏనాడు సంక్రాంతి రేసులో నిలబడలేదు. అలాంటిది ఫస్ట్ టైమ్ పొంగల్ కు వస్తూ ఉండడంతో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎఫెక్ట్ తాజాగా అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ పై కనిపిస్తుంది.

అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ లో పాస్ ల కోసమైతే నిన్న నిర్మాత చినబాబు ఆఫీస్ దగ్గర తొక్కిసలాటే జరిగింది. మీడియ మిత్రులకు ఎందరో ఫోన్లు చేసి పాస్ ల కోసం గగ్గోలు పెట్టారు. నోవాటెల్ లో జరిగే ఈవెంట్ తెలుగు మహాసభలను డామినేట్ చేస్తుందా అనేలా ఉంది. కాని ఈ ఈవెంట్ కు మెయిన్ ఛీఫ్ గెస్ట్ లంటూ ఎవరూ రావడం లేదని తెలిసింది. త్రివిక్రమ్ ,పవన్ లతోనే ఈ ఈవెంట్ నడిచిపోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఈవెంట్ కు ఇన్వైట్ చేయాలనుకున్నా… కొన్ని సమీకరణాల నేపధ్యంలో క్యాన్సిల్ చేసుకున్నారు.

ఎటు చూసినా నోవాటెల్ నిండిపోయింది. పవర్ స్టార్ ,పియస్ పికే అంటూ గోలగోల చేస్తున్నారు. పవన్ పొలిటికల్ స్టంట్ చేయకుండా… కేవలం సినిమాల్లో మాత్రమే ఉంటే… అతనికి రేంజ్ మరో స్థాయికి వెళ్లేదని ఈవెంట్ కొచ్చిన కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. బట్ ఒకటి మాత్రం వస్తవం ఎవరు అవునన్నా కాదన్నా… పవర్ స్టార్ పవర్ స్టారే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -