Thursday, May 16, 2024
- Advertisement -

పదమూడేళ్ళ తర్వాత అదే మేజిక్!

- Advertisement -

సమ్మర్‍కి భారీ అంచనాలతో వచ్చిన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అభిమానులను అలరించడంలో విఫలం అయింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన ఇటివలే బ్రహ్మోత్సవం సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. కానీ రిలీజ్ అయిన మొదటి షో నుంచి ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ప్లాప్‍గా నిలిచింది.

అయితే పదమూడేళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జానీ సినిమాతో, సూపర్ స్టార్ మహేష్ బాబు నిజం సినిమాతో ఘోర పరాజయాలను పొందగా మళ్ళీ అదే సీన్ పదమూడేళ్ళ తర్వాత రిపీటయ్యింది. 2003 ఏప్రిల్ లో జానీ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ కాగా , 2016 ఏప్రిల్ లో రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కూడా దారుణ పరాజయాన్ని పొందింది. అదే కోవలో మహేష్ నటించిన నిజం చిత్రం 2003 మేలో రిలీజ్ అయి ఘోర పరాజయం పొందగా తిరిగి పదమూడేళ్ళ తర్వాత అదే మేజిక్ ని రిపీట్ చేసాడు మహేష్ . 2016 మే లో రిలీజ్ అయిన బ్రహ్మోత్సవం చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. 

దాంతో ఇద్దరు స్టార్ హీరోలు పదమూడేళ్ళ క్రితం…. పదమూడేళ్ళ తర్వాత ఒకే రకమైన రిజల్ట్ అందుకోవడంతో ఆశ్చర్య పోతున్నారు. ఇంకా ఈ సెంటిమెంట్ ని మరింత బలపరిచేలా 2003 కు ముందు ఈ ఇద్దరికీ బ్లాక్ బస్టర్ లు వచ్చాయి ఖుషీ తో పవన్, ఒక్కడు తో మహేష్ పండగ చేసుకున్నారు. కానీ వాటి తర్వాత వచ్చిన జానీ, నిజం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -