Friday, May 17, 2024
- Advertisement -

కారు ఒక్కటే కాదు.. అవి కూడా అమ్మేస్తున్నాడు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కారును అమ్మేసాడు అని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ సంచలనం సృష్టిస్తుంది. అందరిలో పవన్ తన కారు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనే చర్చ మొదలైంది. అయితే గతంలో చెర్రీ పెళ్లీ సమయంలో ఈ కారును కొనుగోలు చేశాడు. మెర్సిడెట్ బెంజ్ కంపెనీకి చెందిన జీ-55 రకానికి చెందిన ఈ కారును అప్పట్లో కోటిన్నర-రెండుకోట్ల మధ్య కొనుగోలు చేశాడు.

ప్రస్తుతం ఈ మోడల్ సంబంధించిన కారులను ఉత్పత్తి చేయడం బెంజ్ సంస్థ ఆపేసింది. ఇక పవన్ ఈ కారును కోటి రూపాయలకు అమ్మేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పవన్ వ్యక్తిగతంగా ఉన్న ఆర్థిక కష్టాలు లేదా జనసేన కోసం నిధుల సేకరణ… ఇలా కారణం ఏదైనా కారును అమ్మేశాడనేది మాత్రం వాస్తవం. అలాగే ఇప్పుడు తనకు సంబంధించిన ఆస్తుల్ని అమ్మేయాలని చూస్తున్నాడట పవన్.

డబ్బుపై పవన్ కు ఎప్పుడూ కూడా ఆలోచన లేదు. లగ్జరీ గా జీవించాలి అని అనుకోడు. తను వద్దంటున్నా ఓ నిర్మాత తన కోసం కారు కొన్నాడనే విషయాన్ని పవన్ తాజాగా తన ఇంటర్వ్యూలో వివరించాడు. తనకు పుస్తకాలు, ఫామ్ హౌజ్ ఉంటే చాలని ఎప్పుడు చెప్పే పవన్… ఇప్పుడు ఆడంబరాల్ని వదులుకుంటున్నాడు.

Related

  1. పవన్ మళ్లీ ఆ తప్పే చేస్తున్నాడా?
  2. ఈటీవీ కి పవన్ షాక్!
  3. పవన్ కళ్యాణ్ కొంప ముంచుతాడా ?
  4. మరో సారి పవన్ సరసన శృతీహాసన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -