Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ తదుపరి సినిమా దర్శకుడు అతనే?

- Advertisement -

అపీషియల్ అని చెప్పలేం కానీ , పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం కు దర్శకుడుని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. తమిళంలో జిల్లా అనే చిత్రం డైరక్ట్ చేసిన నేశన్ ని తన తదపరి చిత్రంకు డైరక్టర్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అది కూడా ఓ తమిళ రీమేక్ అని చెప్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు వేదాలం. అజిత్, శివ కాంబినేషన్ లో వచ్చిన వేదాలం చిత్రం అక్కడ రికార్డ్ లు బ్రద్దలు కొట్టింది.

ఈ నేపధ్యంలో పవన్ ఈ సినిమాని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం దర్శకుడుగా నేసన్ ని ఎంపిక చేసారని వినికిడి. ఈ విషయంపై తమిళ మీడియాతో నేసన్ మాట్లాడుతూ పవన్ తో డిస్కషన్స్ చేస్తున్నానని అన్నారు. తన జిల్లా చిత్రం చూపించి నేసన్ ఓ కథ చెప్పి , గత కొద్ది రోజులుగా పనవ్ తో టచ్ లో ఉంటున్నారు.

అయితే పవన్ ..ముందు ఈ రీమేక్ చేయమని నేశన్ కు చెప్పి, పని ప్రారంభించమని, తెలుగు వెర్షన్ కు తగిన మార్పులు రైటర్స్ తో కూర్చుని చేయమని చెప్పారని చెప్పుకుంటున్నారు. ఈ మేరకు దర్శకుడు నేశన్…ముందు పవన్ సినిమాలు వరస పెట్టి చూస్తున్నాడట. పవన్ ని ఎలా చూపెడితే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారనే విషయం అడిగి తెలుసుకుంటున్నారట. ఆ ఎలిమెంట్స్ అన్ని కలిపి వేదాలం తెలుగు వెర్షన్ కథ రెడీ చేసి పవన్ కు చెప్పి ఓకే చేయించుకుంటారని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -