Saturday, May 4, 2024
- Advertisement -

పద్మావ‌తి వివాదంలోకి ప్ర‌భాస్

- Advertisement -

దీపికా పదుకొనె హీరోయిన్‌గా న‌టించిన ప‌ద్మావ‌తి సినిమా మొదలు నుంచి ఎన్నో అడ్డంకులు ఎదుర్కోంటుంది.సంజయ్ లీలా భన్సాలీ తెరక్కెకించిన ‘పద్మావతి’ సినిమా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రాజకీయ దుమారం రేపుతున్న ఆ సినిమాకు వ్యతిరేకంగా కొద్ది వారాలుగా నిరసనల ప్రదర్శనలు ఎక్కువయ్యాయి.సినిమా విడుద‌ల అపాల‌ని రాజ్‌పుత్ కర్ఱి సేన ర్యాలీలు చేపట్టింది.ఆ సినిమాలో నటించిన దీపికా పదుకొనె, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీల తల నరికి తేస్తే రూ. 5 కోట్లు ఇస్తామని మీరట్‌కు చెందిన క్షత్రియ సమాజ్ ప్రకటించింది.

సడ‌న్‌గా ఈ వివాదంలోకి డార్లింగ్ ప్ర‌భాస్ వ‌చ్చాడు అనే వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ వివాదంలోకి ప్రభాస్‌ను లాగే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది.చరిత్రను వక్రీకరించేలా ఉన్న పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా ప్రభాస్ మాట్లాడాలని కొందరు భావిస్తున్నారు. త‌మ‌కు త‌రుపున మాట్లాడాల‌ని ఆలిండియా క్షత్రియ మహాసభ ప్రభాస్‌ను కోరిన‌ట్లు వార్త సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కోడుతుంది.స‌హ‌జంగానే రాజులు అయిన ప్ర‌భాస్ ప‌ద్మావ‌తికి వ్య‌తిరేకంగా మాట్లాడిస్తే త‌మ‌కు అనుకులంగా ఉంటుంద‌ని ఆలిండియా క్షత్రియ మహాసభ,రాజ్‌పుత్ కర్ఱి సేనలు భావిస్తున్నాయి.ఇప్పుడు ఈ విష‌యంలో జోక్యం చేసుకోకుండా ఉంట‌నే మంచిద‌ని ప్ర‌భాస్ అభిమానులు కోరుకుంటున్నారు.బాహుబ‌లి తరువాత ప్ర‌భాస్ ఇమేజ్ ఒక్క‌సారిగా ఇండియా మొత్తం పెరిగింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -