- Advertisement -
ప్రభుదేవా కొరియోగ్రాఫర్గా, నటుడిగా, దర్శకుడిగా కూడా చేసాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమికుడు సినిమా ద్వారా హీరోగా మంచి పాపులర్ అయ్యాడు. ఆ సినిమా విజయం సాధించడంతో తెలుగు, తమిళ బాషలో పలు చిత్రలో నటించాడు.
ఆ తర్వాత తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం ద్వారా దర్శకుడిగా అయ్యాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్, త్రిష జంట నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ప్రభుకి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు.
ఐతే చాలా కాలం తర్వాత ప్రభుదేవ హీరోగా నటించబోతున్నాడు. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో ప్రభుదేవ సరసన తమన్నాని హీరోయిన్గా తీసుకున్నారు అని తెలుస్తుంది. ఫిబ్రవరి చివరివారం నుంచి సెట్స్ మీదకు వేళ్లాబోయే ఈ సినిమా ఓ హర్రర్ థ్రిల్లర్గా తెరకేక్కుతున్నట్లు సమాచారం.