సాహో సినిమా ఫ్లాప్ తర్వాత రాధే శ్యామ్ సినిమా కి సంబంధించి స్క్రిప్ట్ ని మార్పించి మరీ సినిమాని రీసూటి చేయిస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. మరో వైపు ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ సైట్స్ పైకి వెళ్ళకముందే సంచలనం సృష్టిస్తోంది. రోజుకో వార్త సోషల్ మీడియాలో వస్తు సినిమాపై మరింత అసక్తి క్రియోట్ చెస్తుంది. సినిమా టైటిల్ పోస్టర్ తోనే విపరీతమైన క్రేజ్ సొంతంచేసుకుంది. ఓమ్ రౌత్ దర్శకత్వంలో రామాయణం నుండి ఓ కొత్త పాయింట్ తీసుకుని తెరకెక్కిస్తున్నట్టు టాక్. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా బాలీవుడ్ స్టార్ మీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంక సీత పాత్ర ఎవ్వరు అనేది ఫైనలైజ్ కాలేదు.
ఆదిపురుష్ సినిమాలో ట్విస్ట్ ఇదేనంటూ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. రామాయణం అంటే రాముడు హీరో, రావణుడు విలన్ లా ఎన్నో సినిమాలు వచ్చాయి ఇంకా వస్తునే ఉన్నాయి. అయితే ఆదిపురుష్ సినిమాలో రామాయణంను వేరేలా చూపించబోతున్నాట దర్శకుడు ఓంరౌత్. అన్ని సినిమాల్లో ఎప్పుడు రాముడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూపిస్తుంటారు.
కాని ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాయింట్ ఆప్ వ్యూ ను టచ్ చేసాడట దర్శకుడు ఓంరౌత్. ఎప్పుడు మనం రావణుడిని నెగిటివ్గానే చూసాం, చదివాం. రామ,రావణ యుద్ధంలో ప్రతీకారాన్నే కాకుండా, ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో న్యాయపరమైన కోణం చూపించనున్నారట. అంటే ఇంత వరకు మనకు తెలియని రావణుడిలోని మానవత్వాన్ని కూడా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు ఓంరౌత్. అలాఅని రాముడు ని ఎక్కడా తగ్గించకుండా తగు జాగర్తలు తీసుకుంటు కథ రెడీ చేసుక్కున్నారట దర్శకుడు ఓంరౌత్. దీనిగురించి దర్శకుడు ఓంరౌత్ మరియు చిత్రబృందం స్పందించాలి ఉంది.
జయసుధకి విజయ నిర్మల గారు ఏమవుతారో తెలుసా ?
సడెన్ గా మాయమైన టాలీవుడ్ హీరోయిన్లు..!