Wednesday, May 15, 2024
- Advertisement -

మహేష్ చెప్తనే ప్రభాస్‍ను పట్టుకున్నారు?

- Advertisement -

బాహుబలి సినిమా అంటే వెంటనే గుర్తు వచ్చేది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒకేసారి పెరిగిపోయింది. ఇంతటి క్రేజ్ ఉన్న హీరోతో ఏ నిర్మాతైన సినిమా తీయాలి అనుకుంటారు. శ్రీమంతుడు వటి సూపర్ హిట్ సినిమాని తీసిన మైత్రీ మూవీస్ వారు ఇప్పుడు ప్రభాస్‍తో సినిమా చేయడానికి చూస్తున్నారట.

సినీ పరిశ్రమలో నిర్మాతలు పచ్చగా ఉండాలి అంటే వారికి టాప్ హీరోస్ అండ ఉండాలి. ఐతే శ్రీమంతుడు సినిమాని మహేష్ బాబుతో తీసిన మైత్రీ మూవీస్ మహేష్‍తో మంచి అనుబంధం ఉందట. మైత్రీ మూవీస్ వారు తాము చేయబోయే చిత్రాల గురించి, హీరోల డేట్స్ గురించి మహేష్ తో మాట్లాడి, ఆయన సలహాలు తీసుకుంటారని టాక్.

ప్రభాస్‍తో చేయాలి అనుకుంటున్న సినిమా విషయంలో కూడా మహేష్ సలహా ఉందనుకుంటున్నారు. మైత్రీ మూవీస్ వారు ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరక్షన్ లో జనతా గ్యారేజ్ చేస్తున్నారు.ఈ సినిమా పూర్తవగానే ప్రభాస్ తో ఓ సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్‍కి వస్తున్న వరస అవకశాలు చూసి ప్రభాస్ ఫ్యాన్స్ అనందపడుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయానున్నాడు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -