Thursday, May 23, 2024
- Advertisement -

ప్రభాస్ వారికి భరోసా ఇచ్చాడట!

- Advertisement -

ప్రభాస్, అనుష్కలకు వెండితెరపై మంచి పెయిర్ గా పేరుంది. వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్‍లో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రేండ్స్ కావడం వల్ల ఎలాంటి సహయసహకారాలైనా ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకుంటారు.

అంత స్నేహంగా మెలిగే వీళ్ళిద్దరి మధ్య సీక్రెట్ ఒప్పందం కుదిరిందని సినీ పరిశ్రమలో వార్తలు పూకారు చేస్తున్నాయి. ఆ ఒప్పందం ఏంటో తెలియాలంటే.. అసలు మేటర్ ఎంటో తెలుసుకోవాల్సిందే.

భారీ చిత్రాలు చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న అనుష్క ‘భాగమతి’గా ప్రేక్షకులను కనిపించనుంది. ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో ప్రభాస్ మిత్రులు యువి క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే.. ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువవుతుందన్న ఉద్దేశంతో ఇది కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందా? లేదా? అనే సందేహంలో నిర్మాతలు మునిగిపోయారట. రిస్క్‌లో పడతామేమో అని వారు మీమాంసలో వుండగా.. ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి వారికి భరోసా ఇచ్చాడట.

ఈ మూవీ బడ్జెట్ విషయంలో తానూ సహకరిస్తానని.. అలాగే ఇందులో ఓ పాత్ర కూడా పోషిస్తానని హామీ ఇచ్చాడట. దీంతో.. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. అలాగే.. ప్రభాస్ హామీ ఇవ్వడంతో అనుష్క అతనికి థ్యాంక్స్ చెప్పడంతోపాటు సంతోషం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఏదేమైనా.. అనుష్క కోసం ప్రభాస్ వేసిన ఈ ముందడుగు పట్ల అతని ఫ్యాన్స్ చాలా సంతోషంగా వున్నట్లు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -