డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగేందుకు ప్రభాస్ ఎత్తుగడలు వేస్తున్నాడు. వరుస బెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ – అశ్వనిదత్ బృందంతో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో పూర్తి విభిన్నమైన కథతో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రంతో ప్రభాస్ ని పాన్ వరల్డ్ హీరోగా ఎదిగేస్తాడని అశ్వనిదత్ యూనిట్ అంటుంది. ఈ సినిమా తర్వాత కూడా మరో పాన్ వరల్డ్ సినిమానే చేస్తున్నాడు ప్రభాస్. తానాజీ ఫేం ఓంరౌత్ దర్శకత్వంలో ఎ-ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ నటించబోతున్నాడు. ఈ సినిమా తెలుగు-హిందీ సహా దేశంలోని అన్నిభాషల్లో రిలీజ్ కానుంది. వరుసగా ఈ మూడు సినిమాలతో పాన్ వరల్డ్ హీరోగా ప్రభాస్ ఎదిగేస్తాడా? లేదా? అన్నది అటుంచితే.. ఒక్కో సినిమాకి ప్రభాస్ భారీ పారితోషకమే తీసుకుంటున్నాడు.
రాథే శ్యామ్ తర్వాత ప్రభాస్ – దీపిక- నాగ్ అశ్విన్ సినిమా.. ఆ తర్వాత ఆది పురుష్
ఈ మూడు సినిమాలకి ప్రభాస్ దాదాపుగా 240 కోట్లు రెమ్యునిరేషన్ అందుకుంటున్నాడట. ఒక్కో సినిమాకి ప్రభాస్ కి దాదాపుగా 80 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. ఇదే కాకుండా ఒక్కో సినిమాకి ఏదో ఒక ఏరియా కి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ … శాటిలైట్ రైట్స్ అదనంగా ప్రభాస్ కి ముడుతున్నాయి. ఈ లెక్కన ప్రభాస్ ఈ మూడు సినిమాల ద్వారా గట్టిగానే సంపాధిస్తున్నాడు.
హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్.. రూంలోకి రానిస్తే.. : వర్షిణి
పవన్ కళ్యాణ్ మూవీలో పునర్నవికి ఛాన్స్.. ఏ పాత్ర అంటే ?