Saturday, April 27, 2024
- Advertisement -

పద్మావతి లొల్లిలోకి ప్రభాస్ వస్తాడా

- Advertisement -

పద్మావతి లొల్లి యావత్ దేశాన్ని ఊపేస్తుంది. ఈ సినిమా గురించి పాజిటివ్ గా ఎవరు మాట్లాడినా వారిపై భౌతిక దాడులు జరిగే స్థాయికి విషయం వెళ్లిపోయింది. క్షత్రియకాంత పద్మావతి పాత్ర విషయంలో జరిగిన లొల్లే దీనంతటికీ కారణంగా కనిపిస్తుంది. యుద్దంలో ఓడిపోయిన పద్మావతి భర్త ..అల్లాద్ధీన్ ఖిల్జికి దీపికాను వదులుకోవల్సి వస్తుందంట అనే విధంగా సినిమా రూపొందని వార్తలు రావడంతో ఇష్యూ ఇంత వరకు వచ్చింది. ఇదే విషయంపై అప్పట్లోనే క్లారిటీ ఇచ్చేస్తే ఇంత గొడవ ఉండకపోదును.కాని సంజయ్ లీలా భన్సాలీ ససేమిరా అనడంతో పీకలమీదకు వచ్చేసింది.

తాజాగా ఈసినిమాపై టాలీవుడ్ నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడిల్సిందిగా…. అఖిలభారత క్షత్రియ మహాసభ డిమాండ్ చేస్తోంది. పనిగట్టుకుని అఖిలభారత క్షత్రియ మహాసభ ప్రభాస్ ను ఇలా డిమాండ్ చేయడం వెనుక కారణం… బాహుబలితో అతని పేరు జాతీయ స్థాయిలో మార్మోగడం.అంతేకాదు అతను కూడా క్షత్రియపుత్రుడని నేషనల్ క్షత్రియాస్ అసోసియేషన్ గుర్తించి దానికి తగ్గట్లుగా అతనికి భారీ కటౌట్లు పెట్టడం. బట్ ఈవిషయంపై ఏవిధంగాను స్పందించవద్దని పెద్దనాన్న కృష్ణంరాజు చెప్పడంతో ప్రభాస్ నాకెందుకొచ్చిన గోలనుకుని కామ్ గా ఉన్నాడు. సౌత్ నుంచి పేరొందిన హీరోలలో కమల్ హాసన్ మాత్రమే ఈసినిమాపై స్పందించి అనవసర ఇష్యూని తనపైకి తెచ్చుకున్నాడు.అదే విధమైన మేము చేయకూడదని ఎవరికి వారు సైలంట్ గా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -