మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం మెగాస్టార్కి రావడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖుల శుభాకంక్షలు వెల్లువెత్తాయి. అయితే నిర్మాత నట్టికుమార్ మాత్రం సంచలన కామెంట్స్ చేశారు.
ఎన్నికల్లో పవన్ సపోర్టు కోసమే బీజేపీ..చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చిందని ఆరోపించారు నట్టికుమార్. కరోనా టైమ్లో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సోనుసూద్ అసమాన్య సేవలు చేశారని ఆయన కూడా పద్మ అవార్డుకు అర్హుడే కానీ అలా జరగేలదన్నారు.
కాపుల సపోర్ట్ దొరుకుతుందనే ఉద్దేశం కావచ్చు ఏదైనా మోదీ, అమిత్ షా లాభం లేని పని చేయరంటూ మాట్లాడారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్కు రాజ్యసభ సీటు ఇచ్చి సినిమా తీయమన్న విధంగానే చిరుకు పద్మవిభూషణ్ అవార్డు రావడం అన్నారు. పద్మవిభూషణ్కి చిరంజీవి అర్హుడు కానీ ఇది చిరు కూడా ఊహించి ఉండరన్నారు. ఇక సోనూ సూద్కి కూడా భవిష్యత్తులో వస్తుందని ఆశిద్దాం అంటూ మాట్లాడగా నట్టికుమార్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కాకరేపుతున్నాయి.