Wednesday, May 15, 2024
- Advertisement -

సినిమా కంప్లీట్ అయ్యాక అందరి పని చెబుతా.. : పూరి జగన్నాథ్‌

- Advertisement -

గత నాలుగు రోజులుగా డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ పేరు మార్మోగిపోతోంది. డ్రగ్ రాకెట్‌కు సంబంధించి పోలీసులు వెల్లడించిన ప్రముఖమైన పేర్లలో పూరి జగన్నాథ్‌ది ఒకటి.. ఈ వ్యవహారంలో బయటికి వచ్చిన పేర్లన్నీ కూడా పూరి జగన్నాథ్‌తో ముడిపడ్డవే కావడం.. వాళ్లందరూ ఆయనకు సన్నిహితులు కావడంతో డిస్కషన్ మరింత పెద్దదవుతోంది.

అయితే నోటీసులందుకున్నట్లుగా ప్రచారం జరిగిన వాళ్లలో దాదాపుగా అందరూ మీడియాతో మాట్లాడారు. కానీ రవితేజ, పూరి జగన్నాథ్ మాత్రమే సైలెంటుగా ఉన్నారు. అయితే పూరి మీడియాను బాగానే హ్యాండిల్ చేయగలడు. అయినా మౌనం వహిస్తున్నాడు. దీనిపై స్పందించకపోగా.. తన పేరుతో మీడియాలో వస్తున్న వెర్షన్లు కూడా వాస్తవం కాదంటూ ట్వీట్ పెట్టాడు పూరి. ఇప్పుడీ ఈ వివాదంపై స్పందించి.. మీడియాతో పెట్టుకుంటే ట్రాప్‌లో చిక్కుకున్నట్లే అని, బాగా డిస్టర్బ్ అయిపోతానని.. తన కెరీర్‌కు అత్యంత కీలకమైన ‘పైసా వసూల్’ సినిమాపై ఆ ప్రభావం పడుతుందని భావించి పూరి సైలెంటుగా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ వివదాం వల్ల ‘పైసా వసూల్’ సెట్లోనే ఒకరకమైన అలజడి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మీడియాకు వివరణలు ఇస్తూ.. చర్చల్లోకి వెళ్తే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని.. అందుకే సినిమా అయ్యాక తన వెర్షన్ ఏంటో వినిపించి.. డిస్కషన్లకు వెళ్దామని పూరి అనుకుంటున్నాడట. ‘పైసా వసూల్’కు షూటింగ్ ఇంకో రెండు మూడు వారాల షూటింగ్ మాత్రమే మిగిలుందట. కాబట్టి ప్రస్తుతానికి ఆ సినిమా మీదే దృష్టిపెట్టి ఆ తర్వాత మీడియా ముందుకొద్దామని పూరి ఫిక్సయినట్లు తెలుస్తోంది.

see also : నోర్లు అదుపులో పెట్టుకోండి…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -