Wednesday, May 15, 2024
- Advertisement -

పైసా వసూల్ మూవీ నెగిటివ్ టాక్ కారణం ఏవరంటే..?

- Advertisement -

పైసా వసూల్ మూవీ వాస్తవానికి.. దసరాకి రావాల్సిన మూవీ. రిలీజ్ డేట్ కూడా దసరా దగ్గరలో సెప్టెంబర్ 29 అనుకున్నారు. బాలయ్య సినిమా దసరా రోజున వస్తే.. అభిమానులకు పూనకాలే అని అందరూ అనుకున్నారు. అందులో ఈ సినిమా పూరీ డైరెక్షన్ లో వస్తుండటంతో దసరనే పెద్ద ఛాన్స్ గా కనబడింది.

కానీ అలా అనుకున్నవారికి పూరి జగన్నాథ్ పెద్ద షాక్ ఇచ్చాడు. కేవలం 70 రోజుల్లో సినిమాని కంప్లీట్ చేసి.. సెప్టెంబర్ 1 న సినిమాని రిలీజ్ చేశారు. బాలకృష్ణ లాంటి స్టార్ హీరో మూవీని తక్కువ టైంలో కంప్లీట్ చేసెయ్యడం గొప్ప విషయమే కానీ ఈ చిత్రం క్వాలిటీ చూస్తే మాత్రం పూరీ కంగారు పడిపోయారు అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని చేజింగ్ సీన్ లు మాత్రం పోర్చుగల్ లో తీసి ఎక్కువ భాగం హైదరాబాద్ లోని సెట్ లో తీసేశారు. పూరి ఈ సినిమా కోసం నిర్మాత దగ్గర నుంచి రూ.35 కోట్లు ఖర్చుపెట్టించాడు. ప్రమోషన్ ఖర్చు అదనం.

పారితోషికాల‌తో క‌లిపి, అందులోనే సినిమా తీసిపెట్టాలి. మ‌రి… త‌న‌కు గిట్టుబాటు కావాలి క‌దా? అందుకే వీలైనంత‌లో సినిమా చుట్టేయాల‌ని ఫిక్స‌య్యాడేమో పూరి. శ్రియ తప్పించి పెద్ద స్టార్ కాస్టింగేం కనబడలేదు. పైసా వసూల్ అనే టైటిల్ కి తగిన స్టోరీ కూడా లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ తో నిర్మాత సేఫ్ జోన్ లో ఉన్నాడు. కానీ బయ్యర్ ల పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -