‘ పూరీ జగన్నాథ్ ‘ తెలుగు సినిమా పరిశ్రమలో చాలా త్వరగా సినిమాలు చెయ్యడంలో సిద్ద హస్తుడు పూరీ. ఒక్కొక్కసారి సినిమాలు తీసినంత వేగంగా డబ్బులు వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. నెమ్మది నెమ్మదిగా మార్కెట్ తగ్గుతూ వచ్చింది పూరీ కి. జ్యోతిలక్ష్మి సినిమాతో పూర్తిగా డౌన్ అయ్యింది పూరీ మార్కెట్.
దానికి ముందు ఇద్దరమ్మాయిలతో..హార్ట్ ఎటాక్..టెంపర్..ఇవన్నీ కలెక్షన్ల పరంగా గొప్ప సినిమాలేమీ కావు. దాని ఎఫ్ఫెక్ట్ మొత్తం వచ్చి లోఫర్ సినిమా మీద పడుతోంది. చిరంజీవి సినిమా కూడా ఓకే చెప్పి మధ్యలో డ్రాప్ చెయ్యడం.
మహేష్ తో కూడా సినిమా ఇంకా ఓకే అవ్వకపోవడం లాంటి అంశాలు పూరీ కి పెద్ద దెబ్బలు. లోఫర్ నైజాం లో అమ్మేసారు కానీ మిగిలిన చోట్ల బేరాలు అవడం లేదు అంటున్నారు.
సి కళ్యాణ్ చెబుతున్న రేటు ఎక్కువగా ఉంది అంటున్నారు బయ్యర్ లు. పూరీ జగన్నాథ్ ఈ సినిమా కి ఏడు కోట్లు పారితోషికం అడగడం కూడా సర్వదా చర్చనీయాంశం అయ్యింది.