ఎలాంటి పాత్ర అయిన చేయడానికి ఇష్టపడే కథానాయికల్లో మొదటి వరసలో ఉండే హీరోయిన్ అనుష్క. ఎందుకంటే రుద్రమదేవి, బాహుబలి, సైజ్ జీరో వంటి సినిమాలో అనుష్క నటించడానికి చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు. సైజ్ జీరో చిత్రం కోసం అనుష్క 20 కిలోల వరకు బరువు పెరిగింది. ఎప్పుడు సన్నగా ఉండాని అనుకునే కథనాయికలున్న ఈ రోజుల్లో.. పాత్ర కోసం బరువు పెరిగి శభాష్ అనిపించుకొంది.
ఈ సినిమా చూసిన వారు అనుష్క నిజంగా గ్రేట్ అలాంటి పాత్ర చేయాలి అంటే అది కేవలం అనుష్క వల్లే అవుతుంది అని అన్నారు. అయితే ఇప్పుడు ఈ బరువే అనుష్కను సమస్యలో పడేసింది. సైజ్ జీరో సినిమా అయిపోగానే వెంటనే బరువు తగ్గించుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేసిందట అనుష్క. కాని బరువు పెరిగినంత ఇజీ కాదు కదా బరువు తగ్గడం.
సైజ్ జీరో షూటింగ్ పూర్తయి 4 నెలలైనా అనుష్క బరువులో అంతగా మార్పు రాలేదు. తాజా నాగర్జున చిత్రంలో ఆఫర్ కొట్టేసింది అనుష్క. అయితే ఈ చిత్రంలో కాస్త బొద్దుగా ఉన్న ఫర్వాలేదు కానీ.. బాహుబలి 2 కోసమైనా అనుష్క ఖచ్చితంగా బరువు తగ్గాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంలో రాజమౌళి అనుష్క కు గట్టి వార్నింగ్ ఇచ్చాడట. వీలైనంత తొందరగా బరువు తగ్గాల్సిందే.. అని అనుష్కకి వార్నింగ్ ఇచ్చాడట. ఈ చిత్రం కోసం ప్రభాస్ – అనుష్కల మధ్య యుద్ద సన్నివేశాన్ని తీయాల్సి ఉంటుంది. ఆ సన్నివేశం తీసేలోపు ఖచ్చితంగా సన్నబడాలి అని చెప్పాడట.