Friday, May 3, 2024
- Advertisement -

న్యూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న రకుల్..!

- Advertisement -

టాలీవుడ్ లో అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ ప్రీతీ సింగ్. ప్రభాస్ కజిన్ సిద్దార్థ్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన ‘కెరటం’ చిత్రంతో రకుల్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ రెండో చిత్రం ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మాత్రం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత వచ్చిన కరెంటు తీగ, లౌక్యం, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, స్పైడర్ వంటీ పెద్ద సినిమాలు చేసింది.

అయితే ఈ సినిమాల్లో కొన్ని ప్లాప్స్ కూడా ఉన్నాయి. ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్రలు కూడా చేసింది. దాంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. తమిళంలోను, హిందీ లోనూ సినిమాలు చేసింది కానీ.. అవి కూడా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం రకుల్ కొన్ని మీడియం సినిమాలు చేస్తుంది కానీ.. పెద్ద ఆఫర్లు అయితే ఈమె వద్దకు రావడం లేదు. సినిమాల సంగతి పక్కన పెట్టేస్తే… బిజినెస్ రంగం విషయంలో మాత్రం రకుల్ అందరికంటే ముందుంది.

ఇప్పటికే ‘F45’ జిమ్ బిజినెస్ లు మొదలు పెట్టిన రకుల్.. కొన్ని పాపులర్ సిటీస్ లో బ్రాంచ్ లు కూడా ప్రారంభించింది. ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ లు కూడా మొదలు పెడుతుందని తెలుస్తోంది. రకుల్ కు మంచు లక్ష్మీ, సందీప్ కిషన్, రానా వంటి వారితో మంచి సాన్నిహిత్యం ఉంది. వారి సహకారంతోనే ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెట్టనున్నట్టు టాక్. మరి వీటిలో ఎంత వరకూ నిజముందో తెలియాలంటే రకుల్ స్పందించాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -