Thursday, May 9, 2024
- Advertisement -

Exclusive:ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా ఇంతలా బాధ పడలేదట.

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చూపు ఎటుందంటూ పరిశ్రమ ఆసక్తిగా చర్చ చేస్తోంది.చెర్రీ,అఖిల్ లో ఎవరో ఒకరితో త్రివిక్రమ్ వర్క్ చేయాల్సి ఉంది.తమ కుమారుడితో సినిమా చేయమని ఇరు వర్గాల  నుంచి వస్తోన్న ఒత్తిడి అతను తట్టుకోలేక పోతున్నాడు.ప్రస్తుతం చేస్తోన్న ‘అఆఇఈ’ సినిమా పూర్తి అయిన వెంటనే ఎవరితో చేసేది చెబుతానంటున్నాడు.

కాని ఈలోపు రెండు కాంపౌండ్ లు త్రివిక్రమ్  తమతోనే సినిమా చేస్తాడని నమ్మకాన్ని మరీ పెంచేసుకుంటాయి.చివర్లో వీళ్లకు ఓకే….  మీకు కాదు అంటే ఒక వర్గం ఇతనికి దూరం అయిపోవచ్చు. రెండు వర్గాలు పరిశ్రమను శాసిస్తున్నవే కావడంతో మాటల మాంత్రికుడికి సన్నాఫ్ సత్యమూర్తి ఫ్లాప్ అయినపుడు వచ్చిన భాద కంటే ఈ బాధ ఎక్కువైపోయింది.అందుకే కాబోలు అలా జరక్కూడదనే ఉద్దేశ్యంతో ఏదో ఒక విషయాన్ని తేల్చేయమని తనికెళ్ల భరణి,సీతారామ శాస్త్రిలపై ఒత్తిడి పెరిగిపోతోంది.  

బహుశా కార్తీక మాసం అయ్యాక త్రివిక్రమ్ తన దగ్గరున్న స్టోరీ ఎవ్వరికి సెట్ అవుతుందో చెప్పొచ్చు. ఒక వేల ఎవరికైతే నో చెబుతాడో వారికి కమిటైన వెంచర్ తర్వాత సినిమా చేస్తానని మాట ఇవ్వొచ్చు.మొత్తానికి పంచింగ్ ల కలం వీరుడికి  హీరోలిద్దరూ ఝలక్ ఇచ్చే పనిలో నిమగ్నమై ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -