కథ పూర్తి చేసే పనిలో ఆర్జీవీ బిజీ
దుబాయ్లో శ్రీదేవి మరణించిన నాటి నుంచి ఆమె అంత్యక్రియలు పూర్తయ్యిన దర్శకుడు రామ్గోపాల్ వర్మ శ్రీదేవిని స్మరించుకుంటూనే ఉన్నాడు. ఆమె తనకు ఉన్న అనుబంధాన్ని.. జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాడు. శ్రీదేవి భౌతికకాయం ఉన్నన్నినాళ్లు వర్మను గంటకో ట్వీటు.. కవిత.. సందేశం ఇస్తూ ఆమెపై వీరాభిమానాన్ని చూపాడు. ఎంతో అభిమానించే తన తార లేకపోవడంతో ఇండస్ట్రీలో వర్మనే తెగ బాధపడుతున్నాడు. శ్రీదేవి బతికి ఉన్న రోజుల్లోనూ చాలాసార్లు శ్రీదేవి తన ఆరాధ్య దేవత అని ప్రకటించాడు. ఆ విధంగా ఎప్పుడూ శ్రీదేవి గురించి చెప్పే వర్మ ఇప్పుడు ఆమె జీవిత చరిత్రపై సినిమా తీసే ఆలోచన చేస్తున్నాడు.
శ్రీదేవి దూరమవడంతో విషాదంలో మునిగిన వర్మకు బయోపిక్ ఆలోచన వచ్చింది. శ్రీదేవి జీవితంలోని చాలా విషయాలు వర్మకు తెలుసు. ఆమె జీవితాన్ని దగ్గరగా ఉండి చూసిన వారిలో ఆర్జీవీ ఒకరు. అయితే ఈ సమయంలో శ్రీదేవి బయోపిక్ తీయడం.. ఆ సినిమా ప్రకటించడం మంచిది కాదని భావించిన రామ్గోపాల్ వర్మ దాని గురించి ప్రకటించకుండానే లోలోపల సినిమాకు కావాల్సిన పనులను చేసేసుకుంటున్నారు. కథ సిద్ధంగా కాగానే కొన్నాళ్లు ఆగి ఆ తర్వాత సినిమా ప్రకటిస్తారని సమాచారం. బంధుమిత్రుల్ని నమ్మిన తండ్రి వల్ల ఆస్తులన్నీ కోల్పోయిన శ్రీదేవి.. తన తల్లి పద్ధతితో పూర్తిగా స్వేచ్ఛను కోల్పోయిన శ్రీదేవి… ఆ తర్వాత సినిమాలకు దూరమై ఉన్న శ్రీదేవి.. భర్త, పిల్లలే లోకంగా బతికిన శ్రీదేవి ఇలా ఎన్నో ఆ అతిలోక సుందరి జీవితంలోని ప్రధాన ఘట్టాల ఆధారంగా బయోపిక్ తీయాలనే ఆలోచనలో ఉన్నాడు.
లిటిగేషన్ ఉన్న ఆస్తులపై పెట్టుబడులు పెట్టి చివరికి చేతిలో చిల్లి గవ్వలేని సన్నివేశానికి శ్రీదేవి రావడం.. శ్రీదేవి తల్లి తప్పిదాలు.. బోనీకపూర్తో రెండో పెళ్లి, బోనీ మొదటి భార్య కుటుంబంతో వైరం.. తదితర విషయాలు తదితర వాటి గురించి సినిమా రూపొందించాలనే పనిలో ఉన్నాడు. మరీ ఎప్పుడూ ప్రకటిస్తాడో.. ఈ సినిమాకు శ్రీదేవి కుటుంబసభ్యులు, బోని కపూర్ తదితరులు అంగీకరిస్తారో లేదో చూడాలి.