పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా పవన్ తాజాగా మరొ కొత్త సినిమాను షూరు చేశాడు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ అనే సినిమా రీమేక్లో పవర్ఫుల్ పోలీస్గా ఆయన నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది.దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు త్రివిక్రమ్ స్విచ్చాన్ చేశాడు. ఇందులో పవన్కల్యాణ్తో పాటు రానా దగ్గుబాటి కూడా ఇందులో నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నటించడానికి రానా భారీ రెమ్యునరేషన్ను తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల మేరకు ఈ సినిమా కోసం రానా ఏకంగా రూ.6 కోట్ల రెమ్యునరేషన్గా తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ స్పెషల్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు సమాచారం.
ఇక పవన్ కళ్యాణ్ కేవలం 40రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చినట్లుగా టాక్ వస్తోంది. ఈ సినిమా పూర్తయిన తరువాత పవర్ స్టార్ క్రిష్ పిరియాడిక్ డ్రామాను పూర్తి చేయనున్నాడు. ఇక అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ ను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం రిలీజ్ చేయవచ్చని టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత సమకూరుస్తున్నారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.