టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, ఐపీఎల్ నిత్యం ఫాలో అవుతానని అసలు విషయం బయట పెట్టారు.తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ టీమ్ కి అభిమానిని అని ఈ సందర్భంగా తెలిపారు.
ఆర్సీబీ అభిమాని అయినప్పటికీ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ను ఆర్సీబీ కచ్చితంగా గెలుస్తుందని భావించాను, కాకపోతే కరోనా ప్రభావం వల్ల ఐపీఎల్ మ్యాచ్ వాయిదా పడటం తనకు ఎంతో బాధ కలిగించిందని తెలిపారు.
Also read:టాలీవుడ్ను పక్కన పెట్టేసిన శ్రద్ధ శ్రీనాథ్.. నిజమేనా?
ఐపీఎల్లో ఆర్సీబీ నా ఫేవరెట్ టీమ్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ తన అభిమాన క్రికెటర్ కాదని,టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమానినని తెలిపారు.ధోనీ బ్యాటింగ్, వికెట్ కీపింగ్, కెప్టెన్సీ నాకు చాలా ఇష్టమని తెలిపారు.ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాలో నటిస్తే.