టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు లో ప్రముఖులను సిట్ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ ని, సుబ్బరాజుని, తరుణ్, నవదీప్, శ్యామ్ కే నాయుడు, చార్మి, ముమైత్ ఖాన్, రవితేజను విచారించారు. అయితే హీరో రవి తేజను సిట్ అధికారులు ఆడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులి ఇచ్చాడట. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు అసలు లేదని చెప్పాడట.
తన సోదరుడు భరత్ కు డ్రగ్స్ అలవాటు ఉందనా అనే విషయం రవితేజను అధికార్లు అడటంతో.. అందుకు రవితేజ.. భరత్కు గంజాయి తాగే అలవాటు ఉండొచ్చేమో.. కానీ కొకైన్ వంటి మత్తు పదార్ధాల జోలికి ఎప్పుడు వెళ్లాలేదని పేర్కొన్నాడు. దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మి, ముమైత్ఖాన్లకు డ్రగ్స్ అలవాటుందా.. అనే ప్రశ్నకు అలవాటు లేదని జవాబు చెప్పినట్లు తెలుస్తోంది. విచారణ అయిపోయాక పరీక్షల కోసం గోళ్లు, జుట్టు, రక్త నమూనాలు తీసుకోవచ్చా అని అడగటంతో.. అందుకు రవితేజ నిరాకరించడని.. తెలుస్తోంది.