క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు తెరకు పరిచయమైన రవితేజ.. క్రమంగా స్టార్ హీరో అయిపోయాడు. అతడి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీలో ఓ ప్రత్యేకత ఉండటంతో మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా రవితేజకు పెద్దగా హిట్స్ పడటం లేదు. అయితే ఈ ఏడాది రిలీజ్ అయిన క్రాక్ భారీ హిట్ కొట్టడంతో రవితేజ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు.అయితే క్రాక్ సినిమాకు రవితేజ.. రెమ్యునరేషన్ తీసుకోకుండా నైజాం హక్కులు తీసుకున్నాడట. దీంతో అతడికి దాదాపు రూ. 16 కోట్లు దక్కాయట.
నిర్మాతలను రిస్కులో పెట్టడం ఇష్టం లేక.. రవితేజ షేర్ తీసుకుంటున్నాడట. క్రాక్ హిట్తో రవితేజ ఎక్కువగా మాస్ కథలవైపే మొగ్గు చూపుతున్నాడు. ఖిలాడీ అనే మరో సినిమాను చేయబోతున్నాడు. ఈ మూవీకి కూడా నైజాం హక్కులనే తీసుకున్నాడట రవితేజ. అయితే ఈ మూవీ తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ మరో సినిమాను చేయబోతున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నాడు.
అయితే ఈ సినిమాకు నేరుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట రవితేజ. దాదాపు రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాత అంగీకరించాడట. మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ ఈ మూవీలో హీరోయిన్గా ఎంపికైంది. నిజానికి రవితేజ నిర్మాతలు నష్టపోకుండా ఉండేందుకు షేర్ తీసుకుంటున్నాడు. అయితే నిర్మాత సుధాకర్ మాత్రం రవితేజకు భారీగా రెమ్యునరేషన్ ఇస్తుండటం గమనార్హం. గతంలో ఏ సినిమాకు కూడా రవితేజ ఇంత రెమ్యునరేషన్ తీసుకోలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి క్రాక్ మూవీతో రవితేజ మార్కెట్, రెమ్యునరేషన్ పెరిగాయన్నమాట.
Also Read
స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..