Friday, April 26, 2024
- Advertisement -

రవితేజ రెమ్యునరేషన్​ పెంచేశాడా?

- Advertisement -

క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా తెలుగు తెరకు పరిచయమైన రవితేజ.. క్రమంగా స్టార్​ హీరో అయిపోయాడు. అతడి కామెడీ టైమింగ్​, డైలాగ్​ డెలివరీలో ఓ ప్రత్యేకత ఉండటంతో మాస్​ మహారాజగా పేరు తెచ్చుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా రవితేజకు పెద్దగా హిట్స్​ పడటం లేదు. అయితే ఈ ఏడాది రిలీజ్​ అయిన క్రాక్​ భారీ హిట్​ కొట్టడంతో రవితేజ మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు.అయితే క్రాక్​ సినిమాకు రవితేజ.. రెమ్యునరేషన్​ తీసుకోకుండా నైజాం హక్కులు తీసుకున్నాడట. దీంతో అతడికి దాదాపు రూ. 16 కోట్లు దక్కాయట.

నిర్మాతలను రిస్కులో పెట్టడం ఇష్టం లేక.. రవితేజ షేర్​ తీసుకుంటున్నాడట. క్రాక్​ హిట్​తో రవితేజ ఎక్కువగా మాస్​ కథలవైపే మొగ్గు చూపుతున్నాడు. ఖిలాడీ అనే మరో సినిమాను చేయబోతున్నాడు. ఈ మూవీకి కూడా నైజాం హక్కులనే తీసుకున్నాడట రవితేజ. అయితే ఈ మూవీ తర్వాత శరత్​ మండవ దర్శకత్వంలో రవితేజ మరో సినిమాను చేయబోతున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నాడు.

అయితే ఈ సినిమాకు నేరుగా రెమ్యునరేషన్​ తీసుకుంటున్నాడట రవితేజ. దాదాపు రూ. 15 కోట్లు రెమ్యునరేషన్​ ఇచ్చేందుకు నిర్మాత అంగీకరించాడట. మజిలీ ఫేమ్​ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ ఈ మూవీలో హీరోయిన్​గా ఎంపికైంది. నిజానికి రవితేజ నిర్మాతలు నష్టపోకుండా ఉండేందుకు షేర్​ తీసుకుంటున్నాడు. అయితే నిర్మాత సుధాకర్​ మాత్రం రవితేజకు భారీగా రెమ్యునరేషన్​ ఇస్తుండటం గమనార్హం. గతంలో ఏ సినిమాకు కూడా రవితేజ ఇంత రెమ్యునరేషన్​ తీసుకోలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి క్రాక్​ మూవీతో రవితేజ మార్కెట్​, రెమ్యునరేషన్​ పెరిగాయన్నమాట.

Also Read

స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..

ఆ పాన్ ఇండియా డైరెక్టర్ కు.. ఫస్ట్ టైం రిస్కు తప్పదేమో..

క్యాప్సికమ్‌ తో బరువు తగ్గడం ఈజీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -