Monday, May 6, 2024
- Advertisement -

బాహుబలి-2 ట్రైలర్ లో.. స్టోరీ మొత్తం చెప్పేశాడుగా

- Advertisement -
Reveals Baahubali 2 Story

ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న బాహుబలి-2 ట్రైలర్ కొద్ది గంటల క్రితం విడుదల అయ్యింది. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ ట్రైలర్ కూడా సంచలనాలు సృష్టిస్తుంది. ఈ ట్రైలర్ సినిమా మీద మరింత అంచనాలు పెంచేసింది. ట్రైలర్ విషయానికొస్తే స్టోరీ మొత్తం ట్రైలర్ లో చెప్పేశాడు రాజమౌళి. మొదటి పార్ట్ లో అన్న కోసం రాజ్యాన్ని వదిలాడు భళ్లాలదేవ. అయితే మనసుకి నచ్చిన అమ్మాయి కోసం మాత్రం అన్నతో యుద్ధానికి దిగాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే సినిమా మొదలు కానుంది.

అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధం సినిమాకు హైలెట్ అవనుంది. ఇక అదే కాకుండా తండ్రిని చంపి ప్రస్తుతం మాహిష్మతిని ఏలుతున్న భళ్లాలదేవుడిని శివుడు ఎలా జయించాడు అన్నది కథ కన్ క్లూజన్. ఇక బాహుబలి మొదటి పార్ట్ లో దేవసేనను ఓల్డ్ గెటప్ లో చూపించిన జక్కన్న ఈ పార్ట్ లో అనుష్క అందాలను కూడా హైలెట్ చేస్తున్నాడు. మొదటి భాగం రిలీజ్ అయిన దగ్గర నుంచి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నదానికి కూడా ట్రైలర్ లో క్లూ ఇచ్చాడు రాజమౌళి.

నువ్వు ఉండగా నన్ను ఎవరు చంపుతారు మామా అని కట్టప్పను ఉద్దేశించి చెబుతాడు బాహుబలి. సో కట్టప్ప చంపాల్సిన పరిస్థితులను మరోసారి ట్రైలర్ లో కూడా గుర్తు చేశాడు. సో ఎన్నో అంచనాలతో బాహుబలి-2 ట్రైలర్ మాత్రం అదరగొట్టింది. ఖచ్చితంగా మొదటి పార్ట్ ను మించిన అద్భుతాలు ఇందులో ఉంటాయని చెప్పొచ్చు. గ్రాండ్ విజువల్ ఫీస్ట్ గా రాబోతున్న బాహుబలి ఈ రెండో పార్ట్ లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యారాజ్ పాత్రలను పరిచయం చేసి ట్రైలర్ మాత్రం అద్భుతంగా డిజైన్ చేశాడు.  

{youtube}ptADCcLiH9Y{/youtube}

Related

  1. ‘బాహుబలి 2’ ట్రైలర్‌ రివ్యూ.. సంచలనం సృష్టిస్తోంది
  2. బాహుబలిని చంపింది కట్టప్ప కాదు.. బయటపడ్డ సీక్రెట్‌
  3. బాహుబలి రిలీజ్ చేస్తే.. థియేటర్లను తగులబెడుతారట..!
  4. మోడీకి షాకిచ్చిన బాహుబలి!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -