మెగా మేనల్లుడిగా సాయిధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి వరస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఈ నెపథ్యంలో సుప్రీమ్తో గతేడాది హిట్ కొట్టి,, అదే ఏడాది తిక్కతో ప్లాప్ చూసాడు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ చేస్తున్న మరో సినిమా విన్నర్. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
మాస్ యాక్షన్ చిత్రాల డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ఇప్పటి చిన్న బడ్జెట్ సినిమాలతో మంచి కమర్షియల్ హిట్స్ కొట్టిన సాయి ఈ సారి మాత్రం రిస్క్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. విన్నర్ మూవీని సాయి ధరమ్ గత చిత్రాలతో పోలిస్తే భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్గా రకుల్ప్రీత్… జగపతిబాబు విలన్గా.. బాలీవుడ్ విలన్ అనప్ ఠాగూర్సింగ్ లాంటి వాళ్లు నటిస్తున్నారు.
ఇక షూటింగ్, హార్స్ రేసింగ్ సన్నివేశాలు కలుపుకొని బడ్జెట్ రూ.24 కోట్ల వరకు వచ్చింది. సాయి ధరమ్, గోపిచంద్ మలినేనిల మీద ఉన్న అంచనాలతో ఈ మూవీ బిజినెస్ రూ.30 కోట్లకు చేరుకుంది. ఇక విన్నర్ రూ.30 కోట్ల షేర్ వస్తే గాని గట్టెక్కదు. అంటే ఈ మూవీకి రూ.45 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది. మరి ఇప్పటి వరకు రూ.25 కోట్ల మార్క్ వరకే పరిమితమైన సాయి ఈ భారీ టార్గెట్ అందుకోకపోతే బయ్యర్లు నష్టపోవాల్సిందే.
Related