టాలీవుడ్లో కమెడియన్ వెన్నెల కిషోర్కి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. వరస అవకాశాలతో మంచి ఫాంలో ఉన్నాడు. వెన్నెల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిషోర్ . చాలా తక్కువ సమయంలో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు కిషోర్.
ఇక సోషల్ మీడియాలో వెన్నెల కిషోర్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడు. అయితే ఓ హీరోయిన్ అంటే వెన్నెల కిషోర్ పడి చస్తున్నాడు.. తాజాగా వెన్నెల కిషోర్ తన ట్విట్టర్ అకౌంట్లో ఓ హీరోయిన్ ఫోటో పోస్ట్ చేసి లవ్ సింబల్ ఎమోజీలను పోస్ట్ చేశాడు. అయితే ఆ హీరోయిన్ తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు మలయాళ ప్రేమమ్ మలర్… అదేనండి సాయి పల్లవి. మలయాళ ప్రేమమ్ మూవీలో ఆమె చేసిన క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులను కూడా ఓ రెంజ్ లో ఆకట్టుకుంది.
సాయి పల్లవి తాజాగా తన ఫేస్బుక్లో ఫ్లాష్ దట్ స్మైల్ అంటూ తన స్మైలీ ఫోటోను పోస్ట్ చేసింది. రెడ్ శారీలో చిరునవ్వులు చిందిస్తున్న ఆమె ఫోటోను ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేశారు. ఆ ఫొటో చూసిన వెన్నెల కిషోర్ సైతం ఆమెకు ఫిదా అయ్యి వెన్నెల కిషోర్ ఆమెపై ఇలా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి.. వరుణ్ తేజ్ హీరోగా క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిదా సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది ఈ అందాల భామ.
Related